అసలే కరోనా కష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అలాంటి వారిపై వీలైతే కనికరం చూపించాలి. కానీ కర్కశత్వం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అలాగే చేశాడు. రహదారి పక్కన బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అతని తోపుడు బండిని కాలితో తన్నాడు. దీంతో దానిపై ఉన్న కూరగాయలు అన్నీ నాశనం అయ్యాయి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
పంజాబ్లో మే 15వ తేదీ వరకు లాక్డౌన్ను విధించారు. నిత్యావసరాలు, అత్యవసరం అయ్యే వస్తువులు, సరుకులను మాత్రమే అమ్మేందుకు అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ ఓ వ్యక్తి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటుంటే అతనిపై అక్కడి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నవదీప్ సింగ్ కించిత్ జాలి చూపించలేదు. ఆ తోపుడు బండిని కాలితో తన్నాడు.
అయితే ఆ వీడియో వైరల్ అయిన అనంతరం విషయం ఆ రాష్ట్ర డీజీపీ వరకు వెళ్లింది. దీంతో డీజీపీ దినకర్ గుప్తా నవదీప్ సింగ్ను సస్పెండ్ చేశారు. ఇక ఆ సంఘటన జరిగిన ఫగ్వారా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని సేకరించి ఆ వ్యక్తికి నష్ట పరిహారం కింద అందజేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…