మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ తరువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మరణించడం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చనిపోయారు.
ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,79,200 మందికి పరీక్షలు నిర్వహించారు. 41,64,098 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు నమోదు కాగా 891 మంది చనిపోయారు. సోమవారం 48,621 కేసులు నమోదయ్యాయి. 567 మంది చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం కొత్తగా 3,882 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది చనిపోయారు. ఈ క్రమంలో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చనిపోయారు. మంగళవారం ముంబైలో 2,554 కేసులు నమోదు కాగా, 62 మంది చనిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…