మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ16 పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.
ఒప్పో ఎ16 స్మార్ట్ ఫోన్ ధర రూ.13,990 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ లో ఎక్స్క్లూజివ్గా లభిస్తోంది.