టీచర్లు మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పుతూ మనల్ని సక్రమైన మార్గంలో పయనించేలా చేస్తారు. మనం ప్రస్తుతం ఒక గొప్ప డాక్టర్, ఇంజనీర్ వంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాము అంటే దాని వెనుక టీచర్ అనే వ్యక్తి ఉండడంతోనే మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాము. మనకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే బాధ్యత వారికి ఉంటుంది. అలాంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నమే ఆ ఉపాధ్యాయుడు చేయగా ఆ ఉపాధ్యాయుడికి సదరు విద్యార్థి నుంచి చేదు అనుభవం ఎదురయింది.
ఢిల్లీలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో ఒక విద్యార్థి టీచర్ పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో చదివే లతీఫ్ అనే విద్యార్థి ఇప్పటికే రెండు సార్లు ఇంటర్ ఫెయిల్ అవడంతో మొదటి సంవత్సరంలోనే కూర్చుని చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్న సమయంలో లతీఫ్ తరగతి గదిలో ఇష్టానుసారంగా కూర్చోవడం వల్ల ఉపాధ్యాయుడు అతనికి సరిగ్గా కూర్చోమని చెప్పాడు.
ఉపాధ్యాయుడు తనకు ఈ విధంగా చెప్పడంతో లతీఫ్ ఎంతో ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న ఒక ఐరన్ రాడ్ తీసుకొని టీచర్ తలపై బాదాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లతీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.