ముంబైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో.. ఆ మహిళ తన 3 నెలల పసికందును చంపేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఉన్న సంఘర్ష్ సదన్ బిల్డింగ్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. ఆమెకు ఆడపిల్ల పుడుతుందని అంజనం వేసిన మాంత్రికులు చెప్పగా.. ఆడపిల్ల వద్దనుకున్న ఆ కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించారు.
అయితే ఇప్పుడు ఆమె 4వ సారి గర్భం దాల్చింది. కానీ ఈసారి బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో గత 3 నెలల నుంచి ఆమెను అత్తింటివారు వేధింపులకు గురి చేయసాగారు.
ఆడపిల్లను కన్నావని తరచూ ఆ మహిళను నిందిస్తూ వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ మహిళ తన బిడ్డను తానే చంపుకుంది. నీళ్ల ట్యాంకులో ముంచి ప్రాణాలను తీసింది. కానీ అందరికీ తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళ నేరం తానే చేశానని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్కు తరలించారు.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…