T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 20వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 124 పరుగులను మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో ముష్ఫికుర్ రహీమ్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జేసన్ రాయ్ 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించగా.. డేవిడ్ మలన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్లక చెరొక వికెట్ దక్కింది.