Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది. ఇలా స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా కొండ ఎక్కుతూ అక్కడ ఉన్న పర్వత ప్రాంతాలను, ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ కొండపై కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాంతి పడేచోట నన్ను ఉంచండి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వికపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని దోస్తానా 2, మిలి వంటి చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే జాన్వికపూర్ గత కొద్ది రోజుల నుంచి తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది.