Ram Gopal Varma : సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన పని కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా వరంగల్లో మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కొండను లాంచ్ చేశారు. అయితే ఆర్జీవీ మైసమ్మ తల్లి విగ్రహం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్పదంగా మారింది.
మైసమ్మ తల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోలను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. వరంగల్ లోని మైసమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్తున్నానని, తాను కేవలం వోడ్కా మాత్రమే తాగుతానని, అయినా మైసమ్మ తల్లికి విస్కీ ఇచ్చానని, చీర్స్.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
అయితే ఆయన అలా చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆలయాల్లో దైవాలకు మద్యం నైవేద్యంగా ఇవ్వడం మామూలే అయినప్పటికీ విగ్రహాల మీద మద్యం పోయరని.. ఆలయం బయట అడ్డంగా నీరు పోసినట్లు మద్యం పోసి మొక్కులు తీర్చుకుంటారని.. కానీ విగ్రహాల మీద విస్కీ పోయరని.. కనుక తమ మనోభావాలను దెబ్బ తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్జీవీ విస్కీ పోసిన సంఘటన తాలూకు ఫొటోలు వైరల్గా మారాయి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…