Ram Gopal Varma : సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన పని కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా వరంగల్లో మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కొండను లాంచ్ చేశారు. అయితే ఆర్జీవీ మైసమ్మ తల్లి విగ్రహం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్పదంగా మారింది.
మైసమ్మ తల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోలను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. వరంగల్ లోని మైసమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్తున్నానని, తాను కేవలం వోడ్కా మాత్రమే తాగుతానని, అయినా మైసమ్మ తల్లికి విస్కీ ఇచ్చానని, చీర్స్.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
అయితే ఆయన అలా చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆలయాల్లో దైవాలకు మద్యం నైవేద్యంగా ఇవ్వడం మామూలే అయినప్పటికీ విగ్రహాల మీద మద్యం పోయరని.. ఆలయం బయట అడ్డంగా నీరు పోసినట్లు మద్యం పోసి మొక్కులు తీర్చుకుంటారని.. కానీ విగ్రహాల మీద విస్కీ పోయరని.. కనుక తమ మనోభావాలను దెబ్బ తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్జీవీ విస్కీ పోసిన సంఘటన తాలూకు ఫొటోలు వైరల్గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…