Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే మాస్ హీరోగా ఎంతో గుర్తింపు పొందాడు. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్ సినిమాలే ఉన్నాయి. రొమాంటిక్ జోనర్లో చేసిన సినిమాలు తక్కువ. ఇక తాజాగా ఆయన పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ అనే రొమాంటిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో సందడి చేయనున్నారు. ఇది ఓ గొప్ప ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ మూవీకి చెందిన టీజర్ యూట్యూబ్లో 60 గంటలకు పైగా ట్రెండింగ్లో ఉండి రికార్డు సృష్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యం కాని రికార్డులను రాధే శ్యామ్ తిరగ రాసింది.
కాగా రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ భవిష్యత్ను చెప్పే విక్రమాదిత్యగా నటిస్తున్నారు. వింటేజ్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఎవరో.. వీరెవరో అంటూ సాగే ఈ పాటకు ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
కాగా యూట్యూబ్ లో ఈ పాట సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ లను సొంతం చేసుకుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది.