Nagarjuna : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత అనేక వార్తలు హల్ చల్ చేశాయి. వారిద్దరూ విడాకులు తీసుకునేందుకు కారణాలు ఇవే.. అంటూ చాలా మంది రక రకాల వార్తలను ప్రచారం చేశారు. అయితే ఇప్పటికీ అలాంటి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా నాగార్జున మాట్లాడినట్లుగా చెబుతున్న కొన్ని వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి.
అయితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానంటూ కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిల్లో ఎంతమాత్రం నిజం లేదని.. దయచేసి మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి.. అంటూ నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!!
I request media friends to please refrain from posting rumours as news. #GiveNewsNotRumours— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 27, 2022
సమంతే నాగచైతన్యను ముందుగా విడాకులు అడిగిందని.. అందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడని.. అయితే తన తండ్రి ఏమైనా అనుకుంటారేమోనని, కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఏమవుతుందోనని తన తండ్రి ఫీలవుతారని చెప్పి నాగచైతన్య ఆలోచించాడని.. నాగార్జున చెప్పినట్లు కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ పుకార్లే అని నాగార్జున కొట్టి పారేశారు. తాను ఆ మాటలను ఎక్కడా మాట్లాడలేదన్నారు.