Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తరువాత కార్తికేయ 2 ద్వారా చక్కని విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయింది. దీంతో నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను రాబట్టింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ హిట్ అయిన నేపథ్యంలో కార్తికేయ 3 ఉంటుందా.. లేదా.. అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం ఇచ్చాడు.
కార్తికేయ 3 సినిమాను తీస్తామని నిఖిల్ చెప్పాడు. అయితే ఈ మూవీని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. వంటి వివరాలను మాత్రం నిఖిల్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక కార్తికేయ 3 మూవీని 3డిలో రిలీజ్ చేస్తామని కూడా నిఖిల్ వెల్లడించాడు. కాగా కార్తికేయ 2లో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.

ఇక కార్తికేయ 2 మూవీని శ్రీకృష్ణుడి కథాంశంతో తెరకెక్కించారు. కృష్ణుడికి చెందిన ఒక కాలి పట్టీ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఉత్తరాదిలో కృష్ణుడికి చాలా మంది పూజలు చేస్తారు. కనుకనే సినిమా హిట్ అయిందని అంటున్నారు.