కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జరిగినా సరే కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు గురించి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. విశాఖపట్నంలోనూ సరిగ్గా అలాంటి ఆశ్చర్యపోయే, అబ్బురపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వయస్సు ఉండగా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వయస్సు ఉండేది. అయితే వారిద్దరినీ తీసుకుని వారి బామ్మ భద్రాచలం ఆలయానికి బోటులో గోదావరి నదిపై బయల్దేరింది. కానీ దురదృష్టవశాత్తూ బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు చనిపోయారు.
ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తరువాత మళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ ఆడ పిల్లలే. ఆ రోజున ప్రమాదంలో చనిపోయిన వారే మళ్లీ ఇప్పుడు కవల పిల్లల రూపంలో తమకు పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంపతులదే అని చెప్పవచ్చు. చనిపోయారనుకున్న కుమార్తెలు మళ్లీ ఇలా కవలల రూపంలో జన్మించారని వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…