ఆంధ్ర‌ప్ర‌దేశ్

2 ఏళ్ల కింద‌ట ఇద్ద‌రు కుమార్తెలు దుర‌దృష్ట‌వ‌శాత్తూ చ‌నిపోయారు.. ఇప్పుడు ఆ దంప‌తుల‌కే మ‌ళ్లీ క‌వ‌ల‌ల రూపంలో జ‌న్మించారు..!

కొంద‌రి జీవితాల్లో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జ‌రిగినా స‌రే కొన్ని సంద‌ర్భాల్లో అలాంటి సంఘ‌ట‌న‌లు గురించి చ‌దువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయా ? అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు. విశాఖ‌ప‌ట్నంలోనూ స‌రిగ్గా అలాంటి ఆశ్చ‌ర్య‌పోయే, అబ్బుర‌ప‌రిచే సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

విశాఖ‌ప‌ట్నంలో నివాసం ఉంటున్న అప్ప‌ల రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ త‌యారీ సంస్థ‌లో ప‌నిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కింద‌ట వారికి ఇద్ద‌రు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వ‌య‌స్సు ఉండ‌గా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వ‌య‌స్సు ఉండేది. అయితే వారిద్ద‌రినీ తీసుకుని వారి బామ్మ భ‌ద్రాచ‌లం ఆల‌యానికి బోటులో గోదావ‌రి న‌దిపై బ‌యల్దేరింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ బోటు మునిగి అందులో ప్ర‌యాణిస్తున్న 50 మంది ప్ర‌యాణికులు చ‌నిపోయారు.

ఆ దంప‌తుల‌కు చెందిన ఇద్ద‌రు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయారు. ఈ సంఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే స‌రిగ్గా 2 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్ప‌ల రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించారు. ఇద్ద‌రూ ఆడ పిల్ల‌లే. ఆ రోజున ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారే మ‌ళ్లీ ఇప్పుడు క‌వ‌ల పిల్ల‌ల రూపంలో త‌మ‌కు పుట్టార‌ని ఆ దంప‌తులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘ‌ట‌న యాదృచ్ఛికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ ఎంతో అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంప‌తుల‌దే అని చెప్ప‌వ‌చ్చు. చ‌నిపోయార‌నుకున్న కుమార్తెలు మ‌ళ్లీ ఇలా క‌వ‌ల‌ల రూపంలో జ‌న్మించార‌ని వారు ప‌డుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM