దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవారికి వారి శరీరంలో ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల బాగా దెబ్బ తిన్న వారికి బొడ్డుతాడులోని మూల కణాల ద్వారా చికిత్స చేయవచ్చని ట్రాన్స్సెల్ ఆంకాలాజిక్స్ ఫౌండర్ డాక్టర్ సుభద్ర ద్రావిడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని అస్పైర్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్కు చెందిన బయోటెక్ స్టార్టప్ సంస్థ ‘ట్రాన్స్ సెల్ ఆంకాలజిక్స్’ వైవిద్యభరితమైన ఈ కొవిడ్ చికిత్సను ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు.సాధారణంగా కరోనాతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తులు ఎక్కువభాగం దెబ్బతింటాయి.ఈ క్రమంలోనే మన శరీరం విడుదల చేసే కొన్ని రసాయనాలు తిరిగి ఊపిరితిత్తులను చేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పై మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి బొడ్డుతాడులో ఉన్నటువంటి మూలకణాలు ఎంతో ఉపయోగపడతాయని వీటి ద్వారా కరోనాకు చికిత్సను అందించవచ్చని డాక్టర్ సుభద్ర ద్రావిడ పేర్కొన్నారు.బొడ్డుతాడు నుంచి తీసిన ఈ మూలకణాలను ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి ఎక్కించడం వల్ల శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికాలో ఉపయోగించటం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉన్నాయని, దీనినే ఇండియాలో కూడా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించిన బొడ్డు తాళ్ల నుంచి మూలకణాలను రెట్టింపు చేసి కరోనాతో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా కరోనా నుంచి విముక్తి పొందవచ్చు అని డాక్టర్ సుభద్ర తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…