Categories: క్రైమ్‌

అమ్మాయిల వల్లే ఇలా జరిగింది.. వద్దని చెప్పినా వినలేదు.. రోడ్డు ప్రమాదం గురించి వెల్లడించిన యువకుడు..

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఓ వ్యక్తి తీవ్రగాయాలతో బయట పడ్డాడు. అయితే అతను ఈ ప్రమాదం ఎలా జరిగిందో షాకింగ్‌ విషయాలను వెల్లడించాడు.

గచ్చిబౌలి – హెచ్‌సీయూ రోడ్డు మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్టులు ఎం.మానస (23), ఎన్‌.మానస (21), ప్రయివేటు బ్యాంకు ఉద్యోగి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌ (22)లు చనిపోగా.. సాయిసిద్ధ్ అనే యువకుడు బయట పడ్డాడు. ఈ క్రమంలోనే అతను పోలీసులతో మాట్లాడాడు.

శనివారం ఉదయాన్నే షూటింగ్‌ ఉందని శుక్రవారం రాత్రి ఎం.మానస, ఎన్‌.మానస తమ గదికి వచ్చారని సాయి తెలిపాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగారని అన్నాడు. అమ్మాయిలిద్దరూ బీర్లు సేవించారని అన్నాడు. అయితే మద్యం సేవించిన తరువాత చాయ్‌ తాగుదామని అమ్మాయిలు ఒత్తిడి చేశారని, తాను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ జరిగితే పట్టుబడతాం.. వద్దని ఎంత చెప్పినా వినలేదని, దీంతో కార్లో బయటకు వచ్చామని తెలిపాడు.

మార్గమధ్యలో గచ్చిబౌలి హెచ్‌సీయూ బస్‌ డిపో వద్దకు చేరుకోగానే రహీమ్‌ కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించాడని.. దీంతో కారు ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టిందని, ఈ క్రమంలో అందరమూ చెల్లా చెదురుగా పడిపోయామని తెలిపాడు. కారును నిర్లక్ష్యంగా నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు.

కాగా ఎం.మానసది మహబూబ్‌ నగర్‌ జడ్చర్ల అని, ఎన్‌.మానసది కర్ణాటక అని.. వీరు వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింలలో నటిస్తూ అమీర్‌పేట హాస్టల్‌లో ఉంటున్నారని తెలిపాడు. రహీమ్‌ కుటుంబం మొత్తం అతడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోందని, అతను చనిపోవడంతో వారు అనాథలయ్యారని తెలిపాడు. కాగా వారు ప్రయాణించిన కారుపై ఇప్పటికే రూ.15వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM