శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్02ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్లను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ ఫీచర్లు
- 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే
- 1560 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్
- 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్
- 13, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్ ఫోన్ డైమండ్ బ్లాక్, డైమండ్ బ్లూ, డైమండ్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ను ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్తోపాటు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లు, ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయిస్తారు.