Swetha Reddy : రెండు రోజుల క్రితం బంజారాహిల్స్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. స్థానిక రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్తోపాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ ఇష్యూపై యాంకర్, బీజేపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. డ్రగ్స్ క్యాంపెయిన్లో నీతిబోధ చేసిన చిరంజీవి ఆ వీడియోను తన కూతురు నిహారికకి చూపించడం మరిచిపోయారో.. లేదంటే ఆమెకు చూడ్డానికి ఖాళీలేదో తెలియదు కానీ.. మెగాస్టార్ మాత్రం చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు మహానుభావుడు.. ముందు ఈ వీడియోను ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చూపించాలి. ఆ తరువాత జనానికి చెప్పాల్సింది. డైలాగ్లు, స్పీచ్లు వాళ్ల ఫ్యామిలీలో ఉన్న వాళ్లకి చూపిస్తే బాగుండేది. ఎప్పుడూ బయట ఆడవాళ్లపైన కామెంట్లు చేసే పిల్ల సైనిక్స్ ఎవరైతే ఉన్నారో.. వాళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే నాకు జాలి వేస్తోంది.
నిహారిక పాప.. తప్పతాగి డ్రగ్స్ తీసుకుని స్టేషన్లో ఉందని క్రైమ్ రిపోర్టర్లు మెసేజ్లు పెడుతున్నారు. నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి. డ్రగ్స్ మాఫియా మళ్లీ షురూ అయ్యిందని.. హిందీ, ఇంగ్లీష్లలో కూడా న్యూస్ వస్తోంది. ఎప్పుడూ నిజాలు మాట్లాడే నిఖార్సైన నా లాంటి ఆడవాళ్లపై ఎగేసుకుని పడిపోయే జనసేన తమ్ముళ్లూ.. అన్నలూ.. ఏం చేస్తారో చూస్తుంటే నాకు జాలి వేస్తోంది.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి ఆ గుడిసెలు.. అన్నట్లు.. మనం నీతులు చెప్పడం కాదు. పార్టీలు పెట్టి.. పోస్టర్లు పెట్టి ఎగేసుకుని పడిపోవడం కాదు.. సూక్తులు చెప్పేముందు.. క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడే ముందు.. ఇంట్లో ఉన్న కూతుళ్ల గురించి మాట్లాడుకోవాలి. మెగా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పాపలు ఉన్నారు. ముందు వాళ్ల గురించి ఆలోచించాలి కదా.. ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ లో పెట్టుకోవాలి కదా.. అంటూ విరుచుకు పడ్డారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…