Sreemukhi : టీఆర్పీ రేటింగ్స్ పెంచడం కోసం బుల్లితెరలో అనేక ఐడియాలను ఫాలో అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇందులో ముందు ఉండేది లవ్ ట్రాక్లు, డబుల్ మీనింగ్ డైలాగులు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అదేవిధంగా విడుదల చేస్తూ ఉంటారు. బుల్లితెర లేడీ యాంకర్లు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా భయపడడం లేదు.
డబుల్ మీనింగ్ డైలాగులను మాట్లాడడంలో ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీముఖి. జాతి రత్నాలు షోకి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. శ్రీముఖితోపాటు ఎమ్మాన్యుయెల్, పంచ్ ప్రసాద్, నూకరాజు కూడా తమదైన స్టైల్లో కామెడీని పండిస్తూ ఉంటారు. ఈ షో ద్వారా అప్ కమింగ్ కమెడియన్స్ కు అవకాశం కల్పిస్తున్నారు. స్టాండప్ కామెడీ చేసేందుకు వచ్చిన వారిలో కొంతమంది హద్దులు దాటుతూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారు. ఈ జాతిరత్నాలు కార్యక్రమంలో ఒక అమ్మాయి లేచి నా పేరు మణిమాలిక అని చెప్తుంది.

దానితో నూకరాజు నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక నిన్న పీకాను కోడి ఈక అని కామెడీ చేస్తాడు. దానితో శ్రీముఖి అందుకొని నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక.. పోరా ఎర్రి.. అని అంటుంది. ఆ తర్వాత ఏ పదం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. మిగతా వారంతా తర్వాత రాబోయే పదం అర్థం చేసుకొని పగలబడి నవ్వుకున్నారు.
తర్వాత పదం ఎక్కడ అనేస్తుందో అని భయపడి శ్రీముఖి అడ్డుకుంటూ ఇమ్మాన్యుయేల్ నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక ప్రసాద్ అన్న ఆస్పత్రికి వెళ్లాడు ఆరోగ్యం బాగోలేక అంటూ అడ్డుకట్ట వేస్తూ టాపిక్ ను డైవర్ట్ చేశాడు. ఇలా పంచు డైలాగులు వాడుతూ యాంకర్ శ్రీముఖి హద్దులు దాటిందని చెప్పవచ్చు.