Jio : దేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు బొక్క బోర్లా పడ్డాయి. ఒక జీబీ 4జి డేటాకు అప్పటి వరకు కంపెనీలు సుమారుగా రూ.250 వరకు వసూలు చేసేవి. కానీ జియో వచ్చాక ఆ ఖరీదు రూ.10కి పడిపోయింది. అలాగే ఉచిత కాల్స్, యాప్స్, జియో టీవీ, న్యూస్.. ఇలా అనేక సర్వీసులను ఒక్క జియో సిమ్తో ఉచితంగా పొందే వీలు కల్పించింది. దీంతో చాలా మంది కస్టమర్లు జియో వైపుకు మళ్లారు. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుందన్న చందంగా ఇప్పుడు జియో మారింది.
జియో సేవలు ఇప్పుడు మరీ అంత ఆకట్టుకునేలా లేవు. నెట్వర్క్ క్వాలిటీ కూడా తగ్గింది. అయినప్పటికీ ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త చందాదారులను చేర్పించుకుంటోంది. అయితే అప్పట్లో సృష్టించిన సంచలనం మాదిరిగా జియో మరో సంచలనానికి తెర తీయనుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే జియో త్వరలోనే 5జి సేవలను ప్రారంభించబోతుంది కాబట్టి.
దేశంలో ఇప్పటికే 5జి సేవలకు గాను స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ఇప్పటికే ఎయిర్టెల్తోపాటు జియో కూడా నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నాయి. పలు మొబైల్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని పలు చోట్ల 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జియోతోపాటు ఎయిర్టెల్ కూడా కాస్త ముందు వరుసలోనే ఉంది. ఇక 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ముకేష్ అంబానీ జియో 5జి సేవలను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు ఊపందుకున్నాయి.
దేశంలో 5జి స్పెక్ట్రమ్ వేలంలో జియో టాప్ బిడ్డర్గా నిలిచింది. 24,740 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్ను జియో రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. ఇక దేశంలోని 22 సర్కిళ్లలో జియో తన 5జి సేవలను అందించనుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15న 5జి సేవలను ప్రారంభించడం ద్వారా జియో మరో సంచలనానికి తెర తీయనుందని తెలుస్తోంది. అదే జరిగితే ఈసారి జియో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జియో తరువాత ఎయిర్టెల్ 5జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రెండింటిలో ఏ కంపెనీ ముందుగా 5జి సేవలను అందిస్తుందో చూడాలి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…