Redmi 6A : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన దినచర్యలో భాగం అయిపోయాయి. మనం ఏ పని చేస్తున్నా సరే ఫోన్ మన వెంటే ఉంటోంది. అందులో అనేక పనులను చక్కబెట్టుకుంటున్నాం. అలాగే వినోదాన్ని కూడా పొందుతున్నాం. అయితే కొన్ని సార్లు పలు కంపెనీలకు చెందిన ఫోన్లు పేలుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 6ఎ ఫోన్ పేలింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో నివాసం ఉండే మన్జిత్ అనే వ్యక్తి బంధువు ఒక మహిళ రాత్రి పూట రెడ్మీ 6ఎ ఫోన్ను తల దగ్గర పెట్టుకుని నిద్రించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ పేలింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న ఆ మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే సదరు మన్జిత్ ఒక యూట్యూబర్ కావడంతో ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో స్పందించిన షియోమీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు కస్టమర్ సేఫ్టీ ముఖ్యమని పేర్కొంది. అంతేకాదు.. సంఘటన జరిగిన చోటుకు తాము వెళ్తున్నామని.. అసలు ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసింది. అయితే గతంలోనూ పలు సంఘటనల్లో షియోమీ ఫోన్లు పేలాయి. కానీ మరీ ఇంత తీవ్రంగా ఎవరైనా మరణించిన దాఖలాలు లేవు. కాగా తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మరోమారు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…