Rashmi Gautam : జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మి గౌతమ్ ఎలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. గతంలో అనసూయ కొంత కాలం పాటు జబర్దస్త్ షోకు దూరమైంది. ఆమె స్థానంలో రష్మిని తీసుకున్నారు. తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్లోనూ రష్మి చేసింది. రెండు షోలలోనూ రష్మి అలరించింది.
అయితే మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్కు పరిమితం అయింది. అయినప్పటికీ రష్మి గౌతమ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యాంకర్లలో రష్మి కూడా ఒకరు. అందులో భాగంగానే రష్మి ఎన్నో పోస్టులను తరచూ షేర్ చేస్తుంటుంది.
ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ చోట కుక్కను మున్సిపల్ సిబ్బంది కొడుతుంటే చలించిపోయింది. అలాంటి వారు భూమి మీద బతికేందుకు అనర్హులని పోస్ట్ చేసింది.
ఇక రష్మి గతంలో పలు మూవీల్లో నటించినా.. ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయినప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా ఆమె అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.