Pooja Hegde : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నందితా శ్వేత, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో తాజాగా పూజా హెగ్డే పాల్గొంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటింది. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరినట్లు తెలిపారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న పూజా హెగ్డేకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను.. అని జోగినపల్లి సంతోష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అందులో ‘ప్రేరణ’ అనే పాత్రలో అభిమానులను అలరించనుంది. ఇక ఆచార్య, బీస్ట్ అనే చిత్రాలతోపాటు పలు హిందీ చిత్రాలలోనూ పూజా నటిస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…