Pooja Hegde : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నందితా శ్వేత, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో తాజాగా పూజా హెగ్డే పాల్గొంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటింది. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరినట్లు తెలిపారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న పూజా హెగ్డేకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను.. అని జోగినపల్లి సంతోష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అందులో ‘ప్రేరణ’ అనే పాత్రలో అభిమానులను అలరించనుంది. ఇక ఆచార్య, బీస్ట్ అనే చిత్రాలతోపాటు పలు హిందీ చిత్రాలలోనూ పూజా నటిస్తోంది.