Pooja Hegde : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. ఆచార్య. ఈ మూవీలో రామ్ చరణ్ తేజ గెస్ట్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన పూజా హెగ్డె నటిస్తోంది. అయితే పూజా హెగ్డె జన్మదినం కావడంతో చిత్ర యూనిట్ ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది.
ఆచార్య సినిమాలో పూజా హెగ్డ్ లుక్ పోస్టర్ వైరల్గా మారింది. అందులో ఆమె లంగావోణీ ధరించి అచ్చమైన పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే పోస్టర్ను విడుదల చేసిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది.
ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి చెందిన పోస్టర్స్, టీజర్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. తరువాత సంక్రాంతికి రిలీజ్ను ప్లాన్ చేశారు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి మూవీ విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఆచార్య మూవీని ఫిబ్రవరి 4, 2022వ తేదీన విడుదల చేయనున్నారు.