Online Delivery : ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లో ఏది ఆర్డర్ చేసినా అది నేరుగా మన ఇంటికే వస్తోంది. దీంతో షాపింగ్ చేయడం తగ్గించారు. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆర్డర్ చేసే వీలు ఉండడంతో ప్రతి చిన్న వస్తువును చాలా మంది ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. అయితే ఆన్లైన్లో మనం ఇచ్చే ఆర్డర్కు బదులుగా ఏ సబ్బు బిళ్లనో, రాళ్లో వస్తే.. ఏం చేయాలి ? అంటే..
పంజాబ్కు చెందిన డోరా డెబి అనే యువతి అమెజాన్లో రూ.16,800 కు ఒక ఫోన్ను ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ వచ్చింది కానీ అందులో ఫోన్ లేదు. సబ్బు ఉంది. దీంతో ఖంగు తిన్న ఆమె వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చింది.
అయితే వారు విచారణ చేశారు. కానీ తమ తప్పేమీ లేదని చెప్పారు. రీఫండ్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది. ఫలితంగా ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు అమెజాన్ అంగీకరించింది.
అయితే ఈ విధంగా ఎవరికైనా జరగవచ్చు. కనుక ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేశాక వస్తువు చేతికి వస్తే వెంటనే దాన్ని సీల్ తీయరాదు. జాగ్రత్తగా పరిశీలించాలి. సీల్ ఏమాత్రం చిరిగిపోయినట్లు అనుమానం వచ్చినా అక్కడే ఆ వస్తువును ఏ మొహమాటం లేకుండా ఇచ్చేయాలి. దీంతో మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.