Left Over Foods : సాధారణంగా ఫ్రిజ్లు ఉన్న ఎవరైనా సరే తినగా మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. వాటిని మళ్లీ ఇంకో పూట బయటకు తీసి వేడి చేసి తింటారు. అయితే అప్పటికీ ఆ ఆహారం అయిపోకపోతే మళ్లీ దాన్ని ఫ్రిజ్ లో పెడతారు. ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తినగా మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్లో పెడుతున్న వారు కచ్చితంగా కింద తెలిపిన విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే..
ఆహార పదార్థాలను వండిన తరువాత 90 నిమిషాల్లో తినేయాలి. ఆలోగా వాటిని తిని పూర్తి చేస్తే ఓకే. లేదా ఏమైనా ఆహారాలు మిగిలితే వాటిని వండినప్పటి నుంచి 90 నిమిషాల్లోగా ఫ్రిజ్ లో పెట్టేయాలి. అంటే.. ఇప్పుడు మీరు ఏదైనా వండి తింటే.. అందులో ఏమైనా మిగిలితే.. దాన్ని 90 నిమిషాల్లోగా ఫ్రిజ్లో పెట్టాలన్నమాట. దీంతో అందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది.
ఇక ఒకసారి తినగా మిగిలిన ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్లీ వేడి చేసి తినవచ్చు. కానీ అంత వరకే వాటిని అయిపోగొట్టాలి. ఆ తరువాత కూడా వాటిని ఫ్రిజ్లో పెట్టి మళ్లీ తీసి వేడి చేసి తినరాదు. వాటిల్లో అప్పటికే చాలా వరకు పోషకాలు నశించి ఉంటాయి. పైగా బాక్టీరియా కూడా చేరుతుంటుంది. కనుక ఆహారాలను ఒకసారి మాత్రమే వేడి చేయాలి. మళ్లీ మళ్లీ వేడి చేయరాదు.
ఇక ఆహారాలను వేడి చేయాల్సి వస్తే సాధారణ స్టవ్ మీద వేడి చేయాలి. కానీ మైక్రోవేవ్లను ఉపయోగించరాదు. వాటిల్లో తాజాగా వండాల్సి వస్తేనే వాటిని ఉపయోగించాలి. ఇక పాలు, మాంసం, సముద్రపు ఆహారాల విషయంలోనూ ఇవే జాగ్రత్తలను పాటించాలి. దీంతో తినే ఆహారంలో పోషకాలు కోల్పోకుండా చూసుకోవచ్చు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…