Nellore Chepala Pulusu : మాంసాహార ప్రియుల్లో చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చేపల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. శరీరానికి కావల్సిన పోషణను అందిస్తాయి. అయితే చేపలతో చాలా మంది పులుసు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరు చేపల పులుసు అన్నా కూడా చాలా మంది ఇష్టపడతారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – అరకిలో, నువ్వులనూనె – 6 టేబుల్స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, మెంతులు – అర టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – 2 రెబ్బలు, వెల్లుల్లి పాయలు – 5, అల్లం ముక్క – చిన్నది, పచ్చిమిర్చి – 4, ఉల్లిగడ్డ – 1, చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజంత, టమాటాలు – 6, పసుపు – టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – 3 టీస్పూన్లు, ఉప్పు – తగినంత.
నెల్లూరు చేపల పులుసును తయారు చేసే విధానం..
పాన్లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మెత్తగా దంచిన అల్లం, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో 20 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండుకప్పుల నీళ్లు పోసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని వేయించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. సన్నని సెగపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలపొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…