Acharya Movie On OTT : భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకులని పలకరించారు. ఇందులో రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. మూవీకి మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మెగా అభిమానులు నీరసించిపోయారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఆచార్య మూవీ తొలి వారం హౌజ్ఫుల్తో దూసుకుపోతుందని విశ్వసిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో సినిమాలు విడులైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వస్తుండగా, ఆచార్య మూవీ కూడా త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం.
అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డె నటించింది. చిరు సరసన కాజల్ ని ఎంపిక చేసి ఆ తర్వాత తప్పించారు. ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ధర్మస్థలి అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…