Pomegranate Farming : డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలే కానీ వ్యవసాయం చేసి కూడా కోట్లు సంపాదించవచ్చు. ఇతర ఏ పని చేసినా చాలా మంది వ్యవసాయం దండగ అని భావిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే అతని గురించి చెబితే వ్యవసాయంపై మీకు ఉన్న అభిప్రాయం తప్పని అనుకుంటారు. ఎందుకంటే ఈయన ఏడాదికి కోట్ల రూపాయలను వ్యవసాయం ద్వారానే సంపాదిస్తున్నాడు కనుక. అవును, ఈయనే కర్ణాటకకు చెందిన ఏకాంత్ రాజ్. ఆ రాష్ట్రంలోని చిక్మగళూర్ జిల్లా కడూర్ అనే ప్రాంతంలో ఈయన 8 ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేస్తూ ఏటా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.
ఏకాంత్ రాజ్ ఉన్న ప్రాంతంలో నీళ్లు సరిగ్గా లభించవు. వర్షాలు సరిగ్గా పడవు. అందువల్ల ఇతర పంటల కన్నా దానిమ్మ పంట ఉత్తమమైందని తెలుసుకున్నాడు. దీనికి చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు. అలాగే నీళ్లు కూడా చాలా తక్కువగా అవసరం అవుతాయి. పైగా మార్కెట్లో దానిమ్మ పండ్లకు ఎక్కడైనా సరే డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈయన తనకు ఉన్న 3 ఎకరాల స్థలంలో 1000 దానిమ్మ మొక్కలను పెట్టాడు. ఇంకేముంది.. ఆరంభంలోనే ఆయన అద్భుతాలను చూశాడు. పంట దిగుబడి భారీగానే వచ్చింది. దీంతో ఇంక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అలా ఏకాంత్ రాజ్ అక్కడే మరో 5 ఎకరాలు తీసుకుని మొత్తం 8 ఎకరాల్లో 2375 దానిమ్మ మొక్కలను పెంచుతున్నాడు. వీటి ద్వారా ఒక్కో చెట్టుకు సుమారుగా 50 కిలోల వరకు దానిమ్మ పండ్లు పండుతాయి. ఏడాదికి ఒకసారి పంట వస్తుంది. అంటే మొత్తం ఈయన సుమారుగా 118 టన్నుల మేర దానిమ్మ పండ్లను పండిస్తున్నాడు. 1 కిలోకు రూ.180 నుంచి రూ.200 వరకు ఈయన నేరుగా వ్యాపారులకే విక్రయిస్తున్నాడు. దీంతో ఈయనకు మొత్తం రూ.2.20 కోట్ల టర్నోవర్ వస్తోంది. అయితే అందులో ఖర్చులు పోగా రూ.1.8 కోట్లు మిగులుతున్నాయని చెప్పారు.
అయితే ఏకాంత్ రాజ్ తన దానిమ్మ చెట్లకు కేవలం సేంద్రీ ఎరువునే వాడుతారు. దీంతో పంట దిగుబడి బాగా వస్తుందని చెబుతారు. అలాగే అక్కడ నీటి లభ్యత తక్కువ కనుక డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నట్లు చెప్పారు. దీంతో చాలా వరకు నీళ్లు ఆదా అవడమే కాక, దానిమ్మ పండ్ల దిగుబడి బాగా వస్తుందని చెబుతున్నారు. ఇక మార్కెట్లో ఒక్కో దానిమ్మ మొక్కను రూ.30 నుంచి రూ.50 మధ్య విక్రయిస్తున్నారని తెలిపారు. తాను రూ.48కి ఒక్కో మొక్కను అమ్ముతున్నానని, తాను భాగ్వా అనే వెరైటీకి చెందిన దానిమ్మ పండ్లను పండిస్తున్నానని తెలిపారు. ఒక్కో దానిమ్మ మొక్కను 3 మీటర్ల దూరంలో నాటాల్సి ఉంటుంది. అయితే మొక్కలను నాటేందుకు ముందు నేలను సారవంతం చేయాలి. అందుకు మట్టిలో సేంద్రీయ ఎరువులను కలపాల్సి ఉంటుందని అన్నారు.
ఈ విధంగా వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందని ఏకాంత్ రాజ్ చెబుతున్నారు. వ్యవసాయం అంటే పెద్దగా తెలియకపోయినా ఈ విధంగా సులభంగా కొన్ని సూచనలు తెలుసుకుంటే ఇలాంటి పండ్లను పెంచవచ్చని అంటున్నారు. అయితే దానిమ్మ పండ్లను పెంచేందుకు డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ ఎరువులు చాలా ఉత్తమమైనవని, దీంతో పంట దిగుబడి బాగా రావడమే కాక, పండ్లన్నీ ఒకే సైజులో ఉంటాయని తెలిపారు. కనుక ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈయన రూట్లోనే దానిమ్మ పండ్లను పెంచండి. లాభాలను ఆర్జించండి.
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…