---Advertisement---

మిరియాలు, అల్లం, తేనె తీసుకుంటే కోవిడ్ త‌గ్గుతుందా ? నిజ‌మెంత ?

April 25, 2021 11:31 PM
---Advertisement---

క‌రోనా ఏమోగానీ సోష‌ల్ మీడియాలో లెక్క‌లేన‌న్ని ఫేక్ వార్త‌లు రోజూ విప‌రీతంగా ప్ర‌చారం అవుతున్నాయి. అస‌లు సోష‌ల్ ప్లాట్‌ఫాంల‌లో వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మాలో, లేదో తెలియని అయోమ‌య పరిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం అవుతోంది. కోవిడ్ బాధితులు న‌ల్ల మిరియాలు, అల్లం, తేనెల‌ను తీసుకుంటే క‌రోనా త్వ‌ర‌గా త‌గ్గుతుంద‌ని ఓ వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది.

can taking black pepper and ginger and honey reduces covid fact check

అయితే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న ఆ వార్త‌లో ఎంత మాత్రం నిజంలేద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) త‌న ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డించింది. ఈ మేర‌కు పీఐబీ ట్వీట్ చేసింది. ప్ర‌జలు ఇలాంటి వార్త‌ల‌ను చూసి న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది. ఇలాంటి నిరాధార‌మైన, త‌ప్పుడు వార్త‌ల‌ను చ‌దివి న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

కాగా ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో ఫేక్ వార్త‌లు పెరిగిపోయాయి. కొంద‌రు ప‌నిగట్టుకుని మ‌రీ ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన అధికార యంత్రాంగం ఫేక్ వార్త‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. అలాగే మీడియా సంస్థ‌లు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now