మెట్రోలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త… కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్ వెంచర్ చెన్నై మెట్రో పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చెన్నై మెట్రో పరిధిలో ఉన్నటువంటి మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ వంటి ఖాళీగా ఉన్న 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ నందు తెలుసుకోవచ్చు.
https://chennaimetrorail.org/
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ప్రతి ఒక పోస్ట్ కు తప్పనిసరిగా అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.రెండుదశల పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ యాటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలి.