చెయిన్ స్నాచింగ్లకు పాల్పడడం దొంగలకు కొత్తేమీ కాదు. వారు అవలీలగా ఆ పని చేస్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా మహిళ కనిపిస్తే బైక్ మీద వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్తారు. అయితే ఆ దొంగలు కూడా అలాగే చేయబోయారు. కానీ వారిలో ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అయితే అప్పటికే అతను ఆ గొలుసును మింగేశాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా ఆ గొలుసును బయటకు తీశారు.
బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ప్రాంతంలో ఎంటీ స్ట్రీట్లో రాత్రి 8.50 గంటల ప్రాంతంలో హేమ అనే మహిళ రహదారిపై వెళ్తోంది. అయితే ఆమె దగ్గరకు వచ్చిన ముగ్గురు దొంగలు ఆమె మెడలో ఉన్న 70 గ్రాముల బంగారు గొలుసును దొంగించాలని చూశారు. వారిలో విజయ్ అనే వ్యక్తి గొలుసును దొంగిలించాడు. కానీ ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టూ ఉన్నవారు అక్కడికి వచ్చారు.
అయితే అప్పటికే ఇద్దరు దొంగలు పారిపోయారు. విజయ్ ఒక్కడే మిగిలాడు. ఈ క్రమంలో అతను భయపడి గొలుసును మింగేశాడు. అతన్ని అందరూ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే అతన్ని జనాలు చితకబాదారు. దీంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఎక్స్రే గట్రా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది.
పోలీసులకు మొదట అతను గొలుసు మింగినట్లు తెలియదు. కానీ ఎక్స్రే లో తెలిశాక వారు తమదైన శైలిలో విచారణ చేశారు. అతను గొలుసు మింగినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుల సహాయంతో లాక్సేటివ్లు, అరటి పండ్లను విజయ్కు తినిపించి అనంతరం గొలుసును మలం ద్వారా బయటకు తీయించారు. దాన్ని యజమానురాలికి అప్పగించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…