మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీకు పీఎఫ్ ఖాతా ఉందా.? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాను వచ్చే వడ్డీ డబ్బులను EPFO కస్టమర్లకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు శుభవార్తని తెలుపుతూ EPFO వచ్చే దీపావళి పండుగలో ఖాతాదారుల వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలోనే EPFO సెంట్రల్ బోర్డ్ వడ్డీరేట్లకు కూడా ఆమోదముద్ర తెలియజేయడంతో కేవలం ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభిస్తే వెంటనే వడ్డీ డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020 – 21 సంవత్సరానికి గాను పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది.
తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగానే డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు 2018 – 19 వ సంవత్సరంలో 8.65 శాతం ఉండగా 2017 -18 లో 8.55 శాతం ఉంది. ఇకపోతే 2016 – 17 వడ్డీ రేట్లు 8.65 శాతం ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ 2020 -21 సంవత్సరానికి గాను రావాల్సిన వడ్డీ డబ్బులు త్వరలోనే లబ్ధిదారులకు అందనున్నాయని తెలియడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.