సాధారణంగా పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉంటాయి.ఎంతో కలవరపడుతున్నా మనసుకి కూడా పువ్వులు ఎంతో ప్రశాంతతను కల్పిస్తాయి. పువ్వులు ప్రకృతికి అందాన్ని కూడా తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రకృతిలో ఎంతో అందమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి పుష్పాలు పుష్పిస్తే వాటిని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఉబలాటపడతారు.మరి ఈ విధంగా 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించే ఈ పుష్పాలను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటారు.ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కనువిందు చేసే పుష్పాలను నీలకురింజి పుష్పాలు అని పిలుస్తారు.
కేరళలోని శాంతన్పర షలోమ్ హిల్స్లో ఈ పువ్వులు వికసించాయి.స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ పుష్పాలు జూలై నుంచి అక్టోబర్ నెల మధ్యలో వికసిస్తాయి.ఈ విధంగా పన్నెండేళ్ళకొకసారి పుష్పించే ఈ పువ్వులను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.
#WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv
— ANI (@ANI) August 2, 2021
తాజాగా ఏఎన్ఐ ఇటీవల సంతన్పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు వికసించి గాలికి కదులుతూ ఉన్నటువంటి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.అదేవిధంగా ఈ పుష్పాల నుంచి సేకరించే తేనె ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ పుష్పాల నుంచి సేకరించే తేనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ నీలికురుంజి పుష్పాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.