మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పండు అయినా సరే దాని చెట్టుకు అదే కాస్తుంది. ఆ చెట్టుకు ఇతర పండ్లు పండవు. కానీ ఆ ప్రొఫెసర్ మాత్రం అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించి రికార్డు సృష్టించారు.
సైరాక్యూజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాన్ అకెన్ ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించారు. అందుకు గాను ఆయనకు 9 ఏళ్లు పట్టింది. ఒక చెట్టుకు వివిధ రకాల చెట్లకు చెందిన కొమ్మలను ఆయన అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో దానికి ఇటీవలే 40 రకాలకు పైగా పండ్లు పండాయి.
ఆ చెట్టుకు ప్లమ్స్, పీచెస్, యాప్రికాట్స్, చెర్రీలు.. ఇలా 40 రకాలకు పైగా పండ్లు పండాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.