ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పెట్టుబడి స్కీమ్లలో పోస్టాఫీస్ స్కీమ్లు అత్యంత సురక్షితమైనవని చెప్పవచ్చు. వాటిలో డబ్బును పెట్టుబడి పెడితే చక్కని ఆదాయం కూడా పొందవచ్చు. ఈ క్రమంలోనే 5 ఏళ్ల మెచూరిటీతో అందుబాటులో ఉన్న పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్లో నెల నెలా కొంత మొత్తంలో సొమ్మును జమ చేస్తే మెచూరిటీ తీరాక పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీతో సహా పొందవచ్చు. దీన్నే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పెట్టే డబ్బులకు 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో వడ్డీని మూడు మాసాలకు ఒకసారి లెక్కిస్తారు. కనీసం రూ.100 పొదుపుతో ఈ స్కీమ్ను ప్రారంభించవచ్చు.
ఈ స్కీమ్లో భాగంగా సింగిల్ లేదా జాయింట్ లేదా ముగ్గురు కలిసి ఒకే అకౌంట్ను తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన వారు కూడా అకౌంట్ తెరవచ్చు. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి.
ఈ స్కీమ్లో నెలకు కనీసం రూ.100 పొదుపు చేయవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో పొదుపు చేస్తే అధిక లాభాలు వస్తాయి.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో నెలకు రూ.10వేలు పెట్టుబడి పెడితే ఏడాదికి 5.8 శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్ల మెచూరిటీ గడువు ముగిసే సరికి ఆ మొత్తం రూ.6,96,967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్ సొమ్ము రూ.6 లక్షలు అవుతుంది. వడ్డీ రూ.99,967 చెల్లిస్తారు. ఈ క్రమంలో దాదాపుగా రూ.7 లక్షల ఆదాయం పొందవచ్చు.