టెక్నాల‌జీ

రూ.251 కే స్మార్ట్ ఫోన్ గుర్తుందా ? ఫ్రీడ‌మ్ 251 పేరిట జ‌నాల‌కు భారీగా కుచ్చు టోపీ పెట్టారు.. ఆ కేసు ఏమైంది ?

అప్ప‌ట్లో ఫ్రీడ‌మ్ 251 పేరిట కేవ‌లం రూ.251 చెల్లిస్తే చాలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది గుర్తుంది క‌దా. దీంతో ఆ ఫోన్ కోసం చాలా మంది ఎగ‌బ‌డ్డారు. అస‌లు రూ.251కే స్మార్ట్ ఫోన్ వ‌స్తుందా ? అనే క‌నీస విష‌యం కూడా ఆలోచించ‌కుండా పెద్ద ఎత్తున జ‌నాలు ఆ ఫోన్‌ను రూ.251 చెల్లించి బుక్ చేశారు. కానీ ఫోన్ బుకింగ్స్ ప్రారంభ‌మైన తొలి రోజే అది స్కాం అని తేలింది.

2016 ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన మోహిత్ గోయెల్ అనే వ్య‌క్తి రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట కేవ‌లం రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ను అందిస్తామంటూ పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు చేశాడు. దీంతో తొలి రోజు చాలా మంది రూ.251 చెల్లించి ఫోన్ల‌ను ముంద‌స్తుగా బుక్ చేశారు. మొద‌టి రోజు 30వేల మందికి పైగానే ఆ ఫోన్ బుక్ చేసుకున్నారు. అయితే త‌రువాత ఆ ఫోన్ ను ఎందరు బుక్ చేశారో తెలియ‌దు కానీ మొత్తం రూ.60 కోట్ల మేర డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కానీ ఆ వివ‌రాల‌ను మోహిత్ గోయెల్ వెల్ల‌డించ‌లేదు.

అయితే ఆ త‌రువాత ఇదొక స్కామ్ అని కొంద‌రు కేసు వేశారు. కానీ మోహిత్ మాత్రం తాము ఫోన్ల‌ను డెలివ‌రీ చేసేందుకు ఆల‌స్యం అవుతుంద‌ని, జూ 9, 2016 వ‌ర‌కు 5000 ఫోన్ల‌ను డెలివ‌రీ చేశామ‌ని, మిగిలిన వారికి కూడా ఫోన్ల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని, అందుకు ప్ర‌భుత్వాలు స‌హాయం చేయాల‌ని కోరాడు. కానీ ఆ త‌రువాత ఆ ఫోన్లు ఎవ‌రికీ డెలివ‌రీ అయిన దాఖ‌లాలు లేవు. త‌రువాత ఆ విష‌యాన్ని మ‌రిచిపోయారు. ఇలా మోహిత్ గోయెల్ అనే వ్య‌క్తి భారీ ఎత్తున స్కామ్ చేశాడు. కానీ మీడియాకు మాత్రం ఫోన్ల‌ను డెలివ‌రీ చేశాన‌నే చెప్పుకొచ్చాడు. అయితే ఈ విష‌యంలో నిజం ఏమిటో తెలియ‌దు, కానీ ఆ ఫోన్ల‌ను డెలివ‌రీ అందుకున్న వారికే అస‌లు విష‌యం తెలుస్తుంది.

అయిన‌ప్ప‌టికీ ఇదొక పెద్ద స్కామ్ అని జ‌నాల‌కు ఇప్ప‌టికీ గుర్తు లేదు. దాని గురించే మ‌రిచిపోయారు. కేవ‌లం రూ.251 మాత్ర‌మే క‌దా అని చాలా మంది లైట్ తీసుకున్న‌ట్టున్నారు. కానీ అలా కొన్ని వేల మంది బుక్ చేశారు క‌దా.. క‌నుక అది పెద్ద మొత్త‌మే అవుతుంది. అయినా ఇలాంటి స్కాములు అప్ప‌టి క‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తాయి కానీ.. త‌రువాత పెద్ద‌గా ప‌ట్టించుకోరు. జ‌నాలు పూర్తిగా మ‌రిచిపోతారు. ఇక్క‌డ కూడా ఇలాగే జ‌రిగింది. ఇంకా ఇలాంటి స్కామ్‌లు అనేక విష‌యాల్లో జ‌రుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం.. ప్ర‌జ‌ల త‌ల‌రాత అలాంటిది మ‌రి..!

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM