మొబైల్స్ తయారీదారు వివో.. వై53ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. వై సిరీస్లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ లభిస్తున్నాయి. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్లో 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. దీంతో ఫోన్ను కేవలం 0.24 సెకన్ల వ్యవధిలోనే అన్లాక్ చేయవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
వివో వై53ఎస్ ఫీచర్లు
- 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 1టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11
- 64, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
- బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
వివో వై53ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,490 ఉండగా.. దీన్ని అన్ని ఆన్ లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.