శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ12 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో శాంసంగ్కు చెందిన ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 6.5 ఇంచుల డిస్ప్లే ఉంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ12 ఫీచర్లు
- 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే
- 1560 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఎగ్జినోస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
- 64/128 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్, 48, 5, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎ12 స్మార్ట్ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,499గా ఉంది. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.