మొబైల్స్ తయారీ సంస్థ వన్ప్లస్ మరో కొత్త 5జి ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తుందని వన్ప్లస్కు మంచి పేరుంది. అందులో భాగంగానే అలాంటి ఫీచర్లు కలిగిన ఓ కొత్త ఫోన్ను వన్ప్లస్ లాంచ్ చేసింది. వన్ప్లస్ నార్డ్ 2 5జి పేరిట ఆ ఫోన్ విడుదలైంది. అందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వన్ప్లస్ నార్డ్ 2 5జి ఫీచర్లు
- 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్ప్లే
- 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
- 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్
- 6/8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్
- 50, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
- బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
వన్ప్లస్ నార్డ్ 2 5జి ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.27,999 ఉండగా, 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.34,999గా ఉంది. ఈ ఫోన్ను జూలై 26వ తేదీ నుంచి విక్రయిస్తారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్ను అందిస్తారు.