Vaishnav Tej : గత నెల సెప్టెంబర్ 10వ తేదీన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి తేజ్ కి కాలర్ బోన్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా ఆయన ఇప్పటికీ హాస్పిటల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే సాయి తేజ్ ఆరోగ్యం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండడంపై ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను కర్నూల్ లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్.. సాయి తేజ్ ఆరోగ్యంపై స్పందించారు.
ఈ సందర్భంగా సాయి తేజ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం వైద్యుల తనకి ఫిజియోథెరపీ చేయిస్తున్నారని.. మరో వారం రోజులలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా వైష్ణవ్ తెలియజేశారు.
అయితే సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన విడుదల కాగా, వైష్ణవ్ తేజ్ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుంది.