Tollywood : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలోనే నాగార్జున, చిరంజీవి పలుమార్లు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి మరోమారు సీఎం జగన్తో సమావేశం అయ్యారు. అయితే ఈ సారి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. కాగా వారందరూ సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక చిరంజీవి గతంలోనే పలు మార్లు సీఎం జగన్ను కలిశారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ను కలవడం, తాజా సమావేశంలో పలువురు అగ్ర హీరోలు కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్ఆర్ఆర్ తోపాటు భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విషయం తేల్చకపోతే ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కలసి సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారందరూ విజయవాడకు తరలివెళ్తున్నప్పుడు ప్రైవేటు జెట్లో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…