Anasuya : గత కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్న అనసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో అనసూయపై నెగిటివిటీ, ట్రోల్స్ అధికం కాగా అనసూయ తిరిగి పోరాటం చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు.
సాయి రవి 267 ఐడీతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ పోటోలు పెడుతున్నట్లుగా వెళ్లడయ్యింది. ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీర్రాజు మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సినీ పరిశ్రమలోని హీరోయిన్లు, యాంకర్స్ టార్గెట్ చేస్తూ వారి ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా దర్యాప్తులో వెళ్లడయ్యింది. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. అనసూయ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
వీర్రాజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు అభ్యకరమైన కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఇలానే సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్న మిగతవారు కూడా భయపడాలనే ఉద్దేశంతో తన అకౌంట్ లో వీర్రాజు ను అరెస్ట్ చేసిన విషయాన్ని షేర్ చేసానని అనసూయ పేర్కొన్నారు. మరీ ఈ అరెస్ట్ తో అయినా ఆమెను ట్రోల్ చేస్తున్నవారు భయపడతారని అనసూయ నమ్ముతున్నారు. మరి ఏ మేరకు అనసూయ విజయం సాధించారో వేచి చూడాలి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…