ఒక నీచుడు చేసిన పనికి ఆ పిల్లలకు తల్లి దూరమైంది.. ఎవరికీ ఇలా జరగకూడదు..

ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలులోకి తెచ్చినా, ఎంతో కఠినమైన శిక్షలు వేస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్నోరకాల చట్టాల ద్వారా నిందితులు సురక్షితంగా బయటకు రావడం వల్ల ఎన్నో దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని భవానా ప్రాంతంలో రెండు వారాల క్రితం ఒక మహిళపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఆ వివాహితపై యాసిడ్ దాడి జరగడానికి కారణమేమిటనే విషయానికి వస్తే..

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ 26 ఏళ్ల వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త రోజు కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మొంటూ అనే 23 సంవత్సరాల యువకుడు ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతను ఒత్తిడి చేయడంతో.. ఆమె.. నాకు పెళ్లి అయింది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పెళ్లయిన మహిళను ఇష్టపడటం మంచి పద్ధతి కాదు.. అంటూ అతనికి అర్థమయ్యేలా వివరించింది.

అయితే ఆమె నవంబర్ 3వ తేదీన బయటకు వెళ్లిన సమయంలో మొంటూ అడ్డుపడి తనను పెళ్లి చేసుకోవాలని మరోమారు ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఆమె చాలా గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ముందుగానే ఆమెపై యాసిడ్ దాడి చేయాలని పథకం వేసుకుని అతను తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ క్రమంలో స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె భర్త ముందుగా తనకు ఒక్క మాట చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇన్ని రోజులూ తన బిడ్డలు అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగితే వస్తుంది అని చెప్పాను ఇప్పుడు వారికి నేనేమి సమాధానం చెప్పాలి, ఏంటి మాకు ఈ పరీక్ష.. అంటూ విలపించాడు. ఇక విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో అతనిని కఠినంగా శిక్షించాలని, అతనికి ఉరి శిక్ష పడేలా చేయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM