తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే కరోనా మార్గదర్శకాల అమలు పై రాష్ట్ర డీజీపీ కోర్టుకు నివేదిక అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నిపుణులతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు పెరగటానికి ముఖ్య కారణం మద్యం దుకాణాలని, మద్యం దుకాణాలు కరోనా మహమ్మారికి కేంద్రబిందువుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలలో ఇప్పటివరకు 22 వేల కేసులు నమోదైనట్లు ఈ నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక దూరం పాటించని వారిపై కూడా ఇప్పటివరకు 2,416 కేసులను నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…