భయం ఎంతో ధైర్యవంతులని కూడా కృంగదీస్తుంది. భయం ప్రాణాలను కూడా తీస్తుంది. అటువంటి భయమే 30 ఏళ్ల యువకుడు ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు అశోక్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు.అయితే గత కొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశోక్ అతనికి కరోనా వచ్చిందేమోనని భయపడ్డాడు.దీంతో తల్లి గంగామని, భార్య లక్ష్మి, తమ్ముడు గంగాధర్ తో కలిసి రెంజల్ పీహెచ్సీకి వచ్చి పరీక్ష చేయించుకున్నాడు.
పరీక్షల అనంతరం ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే అశోక్ తనకెంతో నీరసంగా ఉందని తన తల్లితో చెప్పడంతో తన తల్లి అతనికి ఏం కాదు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం నూరిపోసింది. ఇంతలోనే అశోక్ ఉన్నఫలంగా తన తల్లి గంగామణి వడిలో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఒక్కసారిగా తన కొడుకు ప్రాణాలు వదలడంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. మృతుడికి భార్య కొడుకు ఉన్నారు.
ఈ సంఘటన జరిగిన కొద్ది సమయానికి ఆసుపత్రి సిబ్బంది తనకు కరోనా నెగిటివ్ అనే వార్త తెలియజేశారు. ఈ విషయం తెలిసి మృతుడి భార్య, తల్లి మరింత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కరోనా పట్ల ఉన్న భయం, అపోహలు కారణంగానే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని. ఇకపై ఈ వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…