సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి సినీ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తోంది.
అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కుకింగ్ వీడియోల్లో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒకవైపు తన అందాలని ఆరబోస్తూనే మరోవైపు పలు విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తి పెంచుతుంది. తాజాగా పెద్ద రొయ్యల కూర వండింది. ఈ రొయ్య కూర తింటే మీ ఆయన రొయ్య కూడా పెద్దగా అవుతుంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టింది.
అంతేకాదు మధ్య మధ్య కొన్ని నీతి సూక్తులు కూడా చెప్పుకొచ్చింది. ఘుమఘుమలాడిస్తూ శ్రీ రెడ్డి చేసిన రొయ్యల కర్రీ అదిరిందనే చెప్పాలి. చూస్తుంటేనే నోరూరిపోతుందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడం లేదు. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి నటించింది. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అందుకే సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ అలరిస్తుంది.