టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె వల్ల అప్పట్లో టాలీవుడ్ ప్రముఖులు వణికిపోయారు. అయితే ఆ వివాదం సద్దుమణిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాగే తరచూ తన గ్లామరస్ ఫొటోలను, వీడియోలను ఆమె అందులో షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇక ఈమె పెట్టే పోస్టులు కూడా ఎల్లప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. అయితే గత కొంత కాలంగా శ్రీరెడ్డి మాత్రం వివాదాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తన యూట్యూబ్ చానల్లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది.
శ్రీరెడ్డి తన యూట్యూబ్ చానల్లో ఎప్పుడెప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తుందా.. అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా మరోమారు ఆమె మరో వీడియోతో మన ముందుకు వచ్చింది. ఆమె లేటెస్ట్గా పాంప్లెట్స్ చేపల కూర వండింది. ఈ క్రమంలోనే తన అందాలను ఆరబోస్తూ వంట చేస్తూ ఉంటే యువతకు మతులు పోతున్నాయి. తనదైన శైలిలో డైలాగ్స్ వాడుతూ శ్రీరెడ్డి ఈ చేపల కూర వండింది. ఆమె వంటిన ఈ కూరను చూస్తుంటే నోరూరిపోతుందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీరెడ్డి తన చేపల కూరతో మళ్లీ అదరగొట్టింది. ఈమె చేసిన కూరను తింటే నిజంగా వావ్ అనాల్సిందే. అలాంటి లుక్ను ఆ కూర కలిగి ఉంది. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి గత కొంత కాలంగా వివాదాస్పద పోస్టులు ఏమీ పెట్టడం లేదు. ఎవరినీ విమర్శించడం లేదు. తన చానల్ పని తాను చూసుకుంటోంది. టాలీవుడ్లో ఈమెకు అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం చెన్నైలోనే మకాం వేసింది. అప్పుడప్పుడు అక్కడి చానల్స్కు చెందిన ప్రోగ్రామ్లలోనూ ఈమె పాల్గొంటూ వస్తోంది.
శ్రీరెడ్డి గత మార్చి నెలలో నాగబాబు కుమార్తె నిహారికను తీవ్రంగా విమర్శించింది. తరువాత కరాటే కల్యాణికి వార్నింగ్ ఇచ్చింది. యూట్యూబర్ శ్రీకాంత్ కు సపోర్ట్ను అందించింది. ఆ తరువాత మళ్లీ ఎలాంటి వివాదాల జోలికి కూడా ఈమె వెళ్లలేదు. చూస్తుంటే శ్రీరెడ్డి సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇలా ఎందుకు మారిపోయిందన్న విషయమే అర్థం కావడం లేదు. మరి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.