Sreemukhi : బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈమె ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరపై, వెండితెర పై ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి తన బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బంగారు రంగు లంగా ఓణీ ధరించి, జడలో మల్లెపూలు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా ఉండడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఏమున్నవె పిల్ల ఏమున్నవే అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. జడలో మల్లెపూలు పెట్టుకుని మత్తెక్కించే కళ్ళతో శ్రీముఖి ఎంతో అందంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మాస్ట్రో, క్రేజీ అంకుల్స్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.