గత కొంత కాలంగా మల్లెమాల వారి జబర్దస్త్ కార్యక్రమం ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటోంది. స్టార్ కమెడియన్లు దూరం కావడంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే పడిపోయాయి. మరోవైపు రోజా వెళ్లిపోవడం, ఆ తరువాత మరికొందరు కమెడియన్లు కూడా దూరం అవడంతో.. షో కు ఆదరణ తగ్గిపోయింది. ఇక జబర్దస్త్కు యాంకర్ అనసూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్కు డేట్స్ను అడ్జస్ట్ చేయలేకపోతున్నానని చెబుతూ కన్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జబర్దస్త్లో అనసూయ తరువాత కొత్తగా ఎవరు యాంకర్గా వస్తారోనని ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ నెలకొంది. కానీ ఎట్టకేలకు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంకర్ ఎవరు అన్నది బయట పెట్టేశారు.
జబర్దస్త్కు అనసూయ అనంతరం మంజూష యాంకర్గా వస్తుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేశాయి కూడా. అయితే అకస్మాత్తుగా రష్మి గౌతమ్నే మళ్లీ జబర్దస్త్కు కూడా యాంకర్గా తెచ్చారు. గత వారం విడుదలైన ప్రోమోలో పల్లకిలో కొత్త యాంకర్ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూషనే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ కాదు. యాంకర్ రష్మినే జబర్దస్త్కు కూడా యాంకర్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే వాస్తవానికి గతంలో అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా కొంత కాలం పాటు రష్మినే రెండు కార్యక్రమాలకు యాంకర్గా కొనసాగింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్.. ఇలా రెండింటికీ ఆమెనే యాంకర్గా చేసింది. ఆ తరువాత అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు మళ్లీ జబర్దస్త్లో యాంకర్గా అవకాశం ఇచ్చారు. దీంతో రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ బాధ్యతలను తీసుకుంది. దీంతో ఆమె మళ్లీ రెండు షోలకూ యాంకర్గా కొనసాగనుంది.
ఇక మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మినే యాంకర్గా ఉంది. దీంతో మొత్తంగా వారి భవిష్యత్తు అంతా రష్మి చేతుల్లోనే ఉందన్నమాట. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేపథ్యంలో జబర్దస్త్ షోస్ ఇకపై ఎలా కొనసాగుతాయో కూడా చూడాలి. ఈ రిజల్ట్ రానున్న రోజుల్లో తేలనుంది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…