Rashmi Gautam : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అప్పట్లో రేటింగ్స్ భీభత్సంగా వచ్చేవి. ప్రేక్షకులు ఈ షోకు బ్రహ్మరథం పట్టారు. ఈ షో ద్వారానే చాలా మంది కమెడియన్లకు సినిమాల్లో బాగా అవకాశాలు వచ్చాయి. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. తరువాత దీనికి కొనసాగింపుగా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే షోను ప్రారంభించారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే మొదట్లో జబర్దస్త్కు అనసూయ యాంకర్గా ఉండగా.. తరువాత రష్మి వచ్చింది. తరువాత జబర్దస్త్ రెండు షోలకు ఓ దశలో రష్మినే యాంకర్గా చేసింది. అయితే అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెను మళ్లీ జబర్దస్త్కు యాంకర్గా చేశారు. ఇక రష్మి యథావిధిగా ఎక్స్ట్రా జబర్దస్త్కు యాంకర్గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ రెండు షోలు కళ తప్పాయనే చెప్పవచ్చు.
అప్పట్లో ఈ షోలలో ఉన్న కమెడియన్లు ఇప్పుడు లేరు. జడ్జిలు కూడా మారిపోయారు. సుదీర్ఘకాలం నుంచి కొనసాగిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా ఈ షోకు గుడ్ బై చెప్పేశారు. దీంతో ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే ఎమోషనల్గా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా చేసిన ఓ స్కిట్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నెల 10వ తేదీన ప్రసారం కానున్న ఎక్ట్రా జబర్దస్త్ ప్రోమోను తాజా లాంచ్ చేశారు. ఇందులో రష్మి న్యాయం కావాలని రోడ్డెక్కడం విశేషం.
రష్మి తనకు న్యాయం జరగాలని ధర్నా చేస్తుండగా.. ఫ్లైట్లో ఇమ్మాన్యుయెల్ అటు ఇటు కేఏ పాల్ లా తిరుగుతుంటాడు. ఇక రష్మి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటుంది. దీంతో ఇమ్మాన్యుయెల్ కల్పించుకుని.. నేను ముందే చెప్పానా.. ఇలా జరుగుతుందని.. లవ్ సింబల్.. అంటూ వెళ్లిపోతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఇలా ఈ ప్రోమో సాగుతుంది. అయితే రష్మి సుధీర్పైనే స్కిట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ వేదికపై వారిద్దరి మధ్యే కదా లవ్ ట్రాక్ను సృష్టించింది. కనుక సుధీర్ తనకు న్యాయం చేయాలని రష్మి డిమాండ్ చేసిందని స్కిట్ ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…